పెళ్లి బరాత్‌లో ఆ స్టిక్కర్లు చూసి షాకైన బీజేపీ ఎంపీ అర్వింద్ (వీడియో)

by Disha Web Desk 2 |
పెళ్లి బరాత్‌లో ఆ స్టిక్కర్లు చూసి షాకైన బీజేపీ ఎంపీ అర్వింద్ (వీడియో)
X

దిశ, డైనమిక్ బ్యూరో: టెక్నాలజీ పుణ్యమా అని ఎక్కడ చూసినా డిజిటల్స్ పేమెంట్స్‌కే జనాలు ప్రాధాన్యత ఇస్తున్నారు. షాపింగ్ మాల్స్ నుంచి మొదలుకుని ఆఖరికి బఠాణీల కొనుగోలు వరకు డిజిటల్స్ పేమెంట్స్‌నే ఎక్కువగా వాడుతున్నారు. ఈ తరహాలోనిదే ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లుకొడుతుంది. ఓ పెళ్లి బరాత్‌లో బ్యాండు మేళం వాయించే వారు.. వారి మేళాలకు ఫోన్ పే స్కానర్ స్టిక్కర్లను అంటించుకుని వసూలు చేస్తున్నారు. ఒకప్పుడు క్యాష్ మాత్రమే ఉండే పరిస్థితిని దాటి ఆఖరికి బ్యాండు కూడా టెక్నాలజీని అమితంగా వాడుకుంటుందని దీనికి సంబంధించిన ఓ వీడియోను బీజేపీ నేత, నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి ట్వీట్ చేశారు. దీంతో, ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లుకొడుతుంది.


Next Story

Most Viewed