అమర వీరుల కుటుంబాలకు భారీగా పెన్షన్.. కీలక నిర్ణయం దిశగా T- కాంగ్రెస్!

by Disha Web Desk 19 |
అమర వీరుల కుటుంబాలకు భారీగా పెన్షన్.. కీలక నిర్ణయం దిశగా T- కాంగ్రెస్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ ​పార్టీ యువ సంఘర్షణ సభ సోమవారం జరగనున్నది. సాయంత్రం 3 నుంచి 6 గంటల వరకు సభను నిర్వహించనున్నారు. ఈ సభకు చీఫ్ ​గెస్టుగా కాంగ్రెస్​అగ్రనేత ప్రియాంక గాంధీ రానున్నారు. దీనిలో ప్రధానంగా యూత్​డిక్లరేషన్​ప్రకటించనున్నారు. దీంతో పాటు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడి అమరులైన కుటుంబాలకు రూ.25 వేలు పెన్షన్​ఇవ్వాలని కాంగ్రెస్ ​పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని వెల్లడించనున్నారు.

పార్టీ అధికారంలోకి రాగానే తొలి, మలి దశ అమర వీరుల కుటుంబాలకు పెన్షన్​ఇచ్చే ప్రక్రియను మొదలు పెట్టనున్నట్లు కాంగ్రెస్​పార్టీలోని ముఖ్య నేతలు తెలిపారు. దీంతో పాటు ఆయా కుటుంబంలోని వ్యక్తులకు ఉద్యోగాల్లోనూ ప్రత్యేక అవకాశాలు కల్పించే దిశగా కాంగ్రెస్​పార్టీ అడుగులు వేయనున్నట్లు తెలిసింది. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని కాంగ్రెస్​పార్టీ భావిస్తున్నది.

అంతేగాక తొలి, మలి దశ ఉద్యమంలో అమరులైన కుటుంబాలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రత్యేక గుర్తింపు పత్రాలను ఇవ్వనున్నారు. ఇక బిస్వాల్ కమిటీ ప్రకారం ఖాళీలున్న 2 లక్షల ఉద్యోగాలను అధికారంలోకి రాగానే భర్తీ చేయాలని కాంగ్రెస్​నిర్ణయం తీసుకున్నది. ప్రతీ ఏడాది జనవరి 1‌న జాబ్ క్యాలెండర్‌ను రిలీజ్​చేయనున్నారు.

దీంతో పాటు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం వచ్చే వరకు ప్రతీ నెల రూ. 4 వేల రూపాయల ఫించన్‌ను ఇవ్వనున్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ కింద విద్యార్థుల పూర్తి ఫీజుల చెల్లింపు విధానాన్ని ప్రకటించనున్నారు. యువ, రైతు రాజ్యం కోసం సపరేట్ విధి, విధానాలను అనుసరిస్తామని కాంగ్రెస్​లీడర్లు పేర్కొంటున్నారు. అయితే పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ సభకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు లక్ష మంది కార్యకర్తలు వచ్చే అవకాశం ఉన్నదని పార్టీ వర్గాలు విశ్వసిస్తున్నాయి.

Next Story

Most Viewed