- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Congress: కొత్త డీసీసీలకు డెడ్ లైన్పై మహేశ్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు
కొత్త డీసీసీలు అలా చేస్తేనే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందని పీసీసీ చీఫ్ అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: బాధ్యతలు స్వీకరించిన వెంటనే డీసీసీలు జిల్లా సీనియర్ నేతలు, ముఖ్య నాయకులను కలుపుకుని సమన్వయంతో పని చేయాలని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) హితవు పలికారు. కొత్త డీసీసీ అధ్యక్షులు (DCC Presidents) ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ నిర్ణయించిన ఆరు నెలల పనితీరు డెడ్లైన్ మరువకూడదని, ఆ గడువులోపు స్పష్టమైన పురోగతిని చూపించాలని ఆదేశించారు. జిల్లా స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తూ, సమన్వయంతో పని చేస్తేనే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయాలు ఖాయం అవుతాయని స్పష్టం చేశారు. ఇవాళ హైదరాబాద్లో డీసీసీ అధ్యక్షులు, ఫ్రంటల్ మరియు అనుబంధ సంఘాల చైర్మన్లతో టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కీలక సూచనలు, మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన డీసీసీ అధ్యక్షులకు మహేష్ గౌడ్ స్వాగతం పలికి అభినందనలు తెలిపారు.
ఢిల్లీ ధర్నా విజయవంతం చేయండి:
రాష్ట్రంలో జరుగుతున్న ‘ఓట్ చోర్’ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని, 14వ తేదీన ఢిల్లీలో జరగనున్న ‘ఓట్ చోర్ మహా ధర్నా’ విజయవంతం అయ్యేలా అన్ని రంగాల నేతలు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పార్టీ బలపర్చే అభ్యర్థుల గెలుపునకు చర్యలు తీసుకోవాలని అన్నారు.






