పటాన్‌చెరు ఎమ్మెల్యే తమ్ముడికి బెయిల్ మంజూరు

by Disha Web Desk 2 |
పటాన్‌చెరు ఎమ్మెల్యే తమ్ముడికి బెయిల్ మంజూరు
X

దిశ, వెబ్‌డెస్క్: పటాన్‌చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తమ్ముడు మధుసూదన్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. 20 రోజుల తర్వాత బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, గత నెల 20వ తేదీన అక్రమ మైనింగ్ కేసులో మధుసూదన్ రెడ్డి అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అరెస్ట్ చేశాక కోర్టులో హాజరు పర్చగా.. 14 రోజుల రిమాండ్ విధించింది. మరోవైపు.. మధుసూదన్ రెడ్డికి చెందిన ‘సంతోష్ సాండ్ మైనింగ్’ కంపెనీ అనుమతులకు మించి ప్రభుత్వ భూముల్లో మైనింగ్ చేయడంతో పాటు లీజ్ అగ్రిమెంట్ ముగిసినా రెన్యూవల్ చేయించలేదని కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్పెషల్ టాస్క్‌ఫోర్స్’ తెలిపింది. కమిటీ నివేదిక ప్రకారం పటాన్‌చెరులోని లక్డారం, రుద్రారం, చిట్కుల్ గ్రామాల్లో ఆయన కంపెనీ అక్రమ మైనింగ్‌కు పాల్పడినట్లు గుర్తించారు.

Next Story

Most Viewed