- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ఆవిర్భావ శతాబ్ది ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా కొనసాగుతున్నాయి.

దిశ, వెబ్ డెస్క్ : భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ఆవిర్భావ శతాబ్ది ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా కొనసాగుతున్నాయి. పార్టీ ఆవిర్భావ దినోత్సవమైన డిసెంబర్ 26 సందర్భంగా రాష్ట్రాలు, జిల్లాల వారీగా సీపీఐ కార్యాలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక తెలంగాణలోని హైదరాబాద్లో ఉన్న సీపీఐ రాష్ట్ర కార్యాలయం మగ్ధూం భవన్లో రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పార్టీ జెండా ఆవిష్కరణ చేసి, అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీపీఐ భారత గడ్డపై ఆవిర్భవించి నేటికీ వందేళ్లు అవుతోందని అన్నారు.
తాము ఎప్పుడూ ప్రజల పక్షమే వహిస్తామని, ప్రజల సమస్యలపై ప్రభుత్వాలపై పోరాడుతామని పేర్కొన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్లోనూ అనకాపల్లి, ఒంగోలు తదితర జిల్లాల్లో సీపీఐ కార్యాలయాల్లో శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించి, పార్టీ చరిత్ర, త్యాగాలు, ప్రజా పోరాటాలను గుర్తుచేశారు. సీపీఐ శతజయంతి వేడుకలు ఖమ్మం జిల్లాలో నిర్వహించనున్న భారీ సభతో ముగియనున్నాయి.






