పేపర్ లీక్‌లు సర్వసాధారణం: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 1 |
పేపర్ లీక్‌లు సర్వసాధారణం: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం రాష్ట్రాన్ని కుదిస్తున్న వేళ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. మంగళవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ... పేపర్ లీక్‌లు సర్వ సాధారణంగా జరిగేవే అంటూ ఈ వ్యవహారాన్ని తేలిగ్గా తీసిపారేశారు. అప్పుడప్పుడు జరుగుతా ఉంటాయని కూడా చెప్పుకొచ్చారు. గతంలో టెన్త్, ఇంటర్ పేపర్లు కూడా లీకయ్యాయి అనే విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. పేపర్ లీక్‌లో మంత్రి కేటీఆర్ దోషి అనడం సరి కాదన్నారు.

కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వాలనడంలో అర్థం లేదని తెలిపారు. రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలకు ఆధారాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ పీఏ గ్రామంలో అధిక మార్కులు వచ్చిన వారి జాబితా సమర్పించాలన్నారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం తగదని అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ నోటికి అడ్డూ అదుపు లేకుండా పోయిందంటూ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story

Most Viewed