పంటలకు ఎంఎస్పీని పెంచాల్సిందే: పల్లా రాజేశ్వర్ రెడ్డి

by Disha Web Desk 2 |
పంటలకు ఎంఎస్పీని పెంచాల్సిందే: పల్లా రాజేశ్వర్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: కన్యాకుమారి నుంచి ఢిల్లీలోని పార్లమెంట్ వరకు చేపట్టిన రైతుల కిసాన్ యాత్ర సోమవారం హైదరాబాద్ కు చేరుకుంది. బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు అందిస్తుండగా.. రైతు సమస్యలపై 10 డిమాండ్లతో యాత్రను చేపట్టారు. యాత్రలో భాగస్వాములైన రైతు నేతలతో రాష్ట్ర రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి తన ఆఫీసులో భేటీ అయ్యారు. రైతులకు మోడీ సర్కార్ అన్యాయంపై పోరాటానికి తెలంగాణ తరఫున సంపూర్ణ మద్దతు ఇస్తున్నామన్నారు. రైతుల ఉద్యమంతో మోడీ సర్కార్ 3 చట్టాలను వెనక్కి తీసుకుందని గుర్తుచేశారు. పంటలకు ఎంఎస్పీని మరింత పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణలో రైతులకు కేసీఆర్ ఇస్తున్న పథకాలను వారికి వివరించినట్లు చెప్పారు. పలు రాష్ట్రాల రైతు సంఘం నేతలు ఉన్నారు.

Next Story

Most Viewed