హైదరాబాద్ బిర్యానీకి పాకిస్తాన్ క్రికెటర్లు ఫిదా.. ఎన్ని మార్కులు వేశారో తెలుసా?

by Disha Web Desk 2 |
హైదరాబాద్ బిర్యానీకి పాకిస్తాన్ క్రికెటర్లు ఫిదా.. ఎన్ని మార్కులు వేశారో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌ బిర్యానీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఎవరు హైదరాబాద్‌కు వచ్చినా బిర్యానీ టేస్ట్ చేయకుండా వెళ్లరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. తాజాగా.. వరల్డ్ కప్‌లో భాగంగా వార్మప్ మ్యాచ్ ఆడేందుకు హైదరాబాద్‌కు వచ్చిన పాకిస్తాన్‌ ప్లేయర్లు బిర్యానీ తిన్నారు. హైదరాబాద్ బిర్యానీకి ఫిదా అయ్యారు. పాకిస్తాన్‌లోని కరాచీ బిర్యానీ కంటే హైదరాబాద్ బిర్యానీనే సూపర్‌గా ఉందని కితాబిచ్చారు. అంతేకాదు.. మన బిర్యానీకి 10కి ఏకంగా 20 మార్కులు వేశారు. అనంతరం పాకిస్తాన్ జట్టుకు హైదరాబాద్ ఎయిర్పోర్ట్‌లో ఘన స్వాగతం లభించడంపై పాక్ క్రికెట్ బోర్డు సంతోషం వ్యక్తం చేసింది. ఇదిలా ఉండగా.. వార్మప్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. ఉప్పల్ స్టేడియంలో జరిగిన వరల్డ్ కప్ వార్మప్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై ఆస్ట్రేలియా భారీ విజయాన్ని అందుకుంది.



Next Story

Most Viewed