పాక్ కు ఇస్లాం పేరు పలికే అర్హత లేదు.. ఎంపీ అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు

by Ramesh Goud |
పాక్ కు ఇస్లాం పేరు పలికే అర్హత లేదు.. ఎంపీ అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: పాకిస్థాన్ ఇస్లాం పేరు పలికే అర్హత కోల్పోయిందని, దాడుల విషయంలో పాక్ మజాక్ చేస్తుందని ఏఐఎంఐఎం నేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ (AIMIM MP Asaduddin Owisi) సంచలన వ్యాఖ్యలు చేశారు. పహల్గా్మ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ (Operaion Sindoor) పేరుతో పాకిస్థాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. దీంతో పాకిస్థాన్ భారత్ సరిహద్దు రాష్ట్రాలపై డ్రోన్లు, మిస్సైళ్లతో దాడికి యత్నిస్తోంది. ఈ దాడులను భారత ఆర్మీ ధీటుగా ఎదుర్కొంటోంది.

దీంతో భారత్ -పాకిస్థాన్ సరిహద్దుల మధ్య యుద్ద వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలోనే భారత్ సరిహద్దుల్లో పాకిస్థాన్ చేస్తున్న కవ్వింపు చర్యల పట్ల ఎంపీ అసదుద్దీన్ స్పందిస్తూ.. పాకిస్థాన్ (Pakistan) పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ భారత్ లోని అమాయక ప్రజల పైనే దాడి జరుపుతోందని, అమాయకులను, చిన్న పిల్లలను చంపమని ఇస్లాం (Islam) చెప్పలేదని వ్యాఖ్యానించారు.

అలాగే ఈ సమయంలో మనందరం జవానులకు మద్దతుగా ఉండాలని అసద్ పిలుపునిచ్చారు. ఇక దాడుల విషయంలో పాకిస్తాన్ మాటిమాటికి మజాక్ చేస్తుందని, పాకిస్తాన్ దాడి చేస్తే భారత్ (India) వెనక్కి తగ్గదు అని స్పష్టం చేశారు. అలాగే అమాయకులను, చిన్నపిల్లలను చంపే పాకిస్తాన్‌కు ఇస్లాం పేరు పలికే అర్హత లేదని హాట్ కామెంట్స్ చేశారు. ఇక అమ్మ కడుపులో నుండి ఈ భూమిపై పడ్డామని, అలాంటప్పుడు చచ్చే వరకు ఈ భూమి కోసమే బ్రతకాలి అని ఎంఐఎం ఎంపీ అన్నారు.



Next Story

Most Viewed