ఓల్డ్‌సిటీ యువకులపై ఒవైసీ సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk |
ఓల్డ్‌సిటీ యువకులపై ఒవైసీ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో : పాతబస్తీ యువకులపై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాతబస్తీ యువకులు నెట్రోవిట్‌ అనే మత్తు పదార్థాలు వాడి ఆ మత్తులో హత్యలు, నేరాలకు పాల్పడుతున్నారని ఒవైసీ అన్నారు. అడ్డగోలుగా మత్తు పదార్థాలు అమ్ముతున్న మెడికల్‌ షాపులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాతబస్తీ యువకులు మత్తుకు బానిసలవుతున్నారని, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఒవైసీ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. పాతబస్తీలో ఓ నేరస్తుడితో పోలీసులు కుమ్మక్కయ్యారని, మాదకద్రవ్యాల వంటి మత్తు పదార్థాలను విక్రయిస్తున్న వారిపై తక్షణమే చర్యలు తీసుకోకపోతే చీకటి ఒప్పందాలన్నీ బయటపెడతామని హెచ్చరించారు.

మరోవైపు, ఎంఐఎం ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు మాట్లాడే తీరును మార్చుకోవాలని సూచించారు. రాత్రిపూట ప్రజల సమస్యలతో ఫోన్ చేస్తే స్పందించడం లేదని పదేపదే ఫిర్యాదులు వస్తున్నాయని, ఉదయం ప్రజాప్రతినిధులు 11 గంటల వరకు ఫోన్ ఎత్తడం లేదని ఫిర్యాదులు వస్తున్నట్లు అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించకపోయినా, ప్రజలకు ఇబ్బంది కలిగించినా.. వెంటనే వారిని పార్టీ నుంచి తొలగించడంలో ఏమాత్రం వెనకడుగు వేయనని మజ్లీస్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లకు అసదుద్దీన్ ఒవైసీ హెచ్చరించారు.

Next Story

Most Viewed