'విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాజీనామా చేయాలి'

by Disha Web Desk 2 |
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాజీనామా చేయాలి
X

దిశ, వెబ్‌డెస్క్: నేడు యూనివర్సిటీల బంద్‌కు ఓయూ జేఏసీ పిలుపునిచ్చింది. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థి మృతికి నిరసిస్తూ బంద్‌కు పిలుపునిచ్చింది. అంతేగాక, విద్యార్థి మృతికి బాధ్యత వహిస్తూ తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాగా, బాసర ట్రిపుల్ ఐటీలోని హాస్టల్ గదిలో ఇంజినీరింగ్ ఫస్టియర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. విద్యార్థి చనిపోయినా కాలేజీ ఇంచార్జి వీసీ, డైరెక్టర్ కనీసం పట్టించుకోవడం లేదని, విద్యార్థి మృతి వివరాలపై ఆరా తీయలేదని తోటి విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.



Next Story

Most Viewed