- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Tirumala: తిరుమలలో సిఫారసు లేఖల కోసం స్పెషల్ ఆఫీసర్
తిరుమలలో తెలంగాణ లేఖల వ్యవహారాల కోసం ప్రభుత్వం స్పెషల్ ఆఫీసర్ ను నియమించింది.

X
దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలను పరిగణలోకి తీసుకునేందుకు టీటీడీ (TTD) బోర్డు ఆమోదం తెలిపిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం (TG GOVT) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సిఫారసు లేఖల వ్యవహారాలను చూసుకునేందుకు ఓఎస్డీని నియమించింది. సి.గణేశ్ కుమార్ సేవలను వినియోగించుకునేందుకు తాజాగా ప్రభుత్వం అనుమతి జారీ చేసింది. రెండేళ్ల పాటు కాంట్రాక్టు పద్ధతిలో ఆయన సేవలను వినియోగించుకునేందుకు అనుమతి ఇస్తూ గవర్నమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా ఆదేశాలు జారీ చేశారు.
Next Story






