- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విపక్ష నేతలు ప్రభుత్వాన్ని అభినందించాలి.. విప్ ఆది శ్రీనివాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేబినెట్ నిర్ణయం తీసుకోవడం శుభ పరిణామమని ప్రభుత్వం విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.

X
దిశ, వెబ్డెస్క్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేబినెట్ నిర్ణయం తీసుకోవడం శుభ పరిణామమని ప్రభుత్వం విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కామారెడ్డి డిక్లరేషన్ను నిలబెట్టిన సీఎం రేవంత్ రెడ్డికి బీసీల తరఫున ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీతో పాటు శాసనమండలిలో స్థానిక సంస్థల్లో 42 రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేసి కేంద్ర ప్రభుత్వం పంపిందని అన్నారు. కానీ, బిల్లుపై వారు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతోనే 2018 పంచాయతీ రాజ్ చట్టాన్ని సవరిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకువస్తుందని అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ నాయకులు సర్కార్ నిర్ణయం పట్ల సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలపాలని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.
Next Story






