ఆపరేషన్ ప్రహార్ ఆపాలి: మావోయిస్టు నేత ఆజాద్ లేఖ

by Disha Web Desk 12 |
ఆపరేషన్ ప్రహార్ ఆపాలి: మావోయిస్టు నేత ఆజాద్ లేఖ
X

దిశ, తెలంగాణ క్రైమ్ బ్యూరో: మావోయిస్టు పార్టీని మట్టుబెట్టే లక్ష్యంతో చేస్తున్న ఆపరేషన్ ప్రహార్‌ని వెంటనే ఆపాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు మావోయిస్టు పార్టీ ప్రతినిధి ఆజాద్ లేఖ విడుదల చేశారు. లేఖలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాలతో పోలీసులు వరుస దాడులు చేస్తున్నారన్నారు. జనవరి 11న మావోయిస్టు పార్టీ గెరిల్లా నాయకుడు ఇడ్మాను లక్ష్యంగా చేసుకొని పోలీసులు డ్రోన్ల ద్వారా దాడులు చేశారాన్నారు.

అయితే, ప్రజలు అండగా ఉన్నంతకాలం పోలీసులు మావోయిస్టు పార్టీని ఏమీ చెయ్యలేరన్నారు. ఈ నెల 7న మరోసారి డ్రోన్లు, హెలీకాప్టర్‌లతో భట్టిగూడ, కావూర్ గట్టు, మీన గుట్ట, జబ్బ గుట్ట గ్రామాల పై కొన్ని గంటలపాటు దాడులు చేసారన్నారు. సహజ వనరులను పెట్టుబడిదారులకు కట్టబెట్టడానికే ఇదంతా చేస్తున్నారన్నారు. వెంటనే పోలీస్ క్యాంపులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed