కాంగ్రెస్ ఆశావాహులకు బిగ్ అలర్ట్.. మరో మూడు రోజులే చాన్స్..!

by Disha Web Desk 19 |
కాంగ్రెస్ ఆశావాహులకు బిగ్ అలర్ట్.. మరో మూడు రోజులే చాన్స్..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ పొందేందుకు దరఖాస్తు గడువు కేవలం మరో మూడు రోజుల మాత్రమే ఉన్నది. దీంతో ఆశావహులు, అభ్యర్థులు వెంటనే అప్లై చేయాలని టీపీసీసీ సూచించింది. ఈ నెల 18 నుంచి మంగళవారం సాయంత్రం వరకు గాంధీభవన్‌లో 305 మంది అప్లై చేశారు. బయోడెటాతో పాటు అందరూ డీడీలను సమర్పించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే ఇప్పటికే దరఖాస్తు ప్రాసెస్ నత్తనడకనే కొనసాగుతుంది. తమ పేర్ల మీద మంచి ముహుర్తాల కోసం లీడర్లు వెయిట్ చేస్తున్నారని ప్రచారం జరుగుతున్నది. ఇక కొత్త చేరికలపై అప్లికేషన్ గడువు మినహాయించాలని పార్టీ భావిస్తున్నది. టీపీసీసీ ఓ తీర్మానం చేసి ఏఐసీసీకి పంపిస్తుందని ఓ నేత తెలిపారు.


Next Story