అమితాబ్ బచ్చన్ బంధువు కేసు: హైదరాబాద్‌కు ఢిల్లీ పోలీసులు

by Disha Web Desk 2 |
అమితాబ్ బచ్చన్ బంధువు కేసు: హైదరాబాద్‌కు ఢిల్లీ పోలీసులు
X

దిశ, తెలంగాణ క్రైమ్ బ్యూరో: బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ బంధువును మోసం చేసిన కేసులో ఒకరు అరెస్ట్ అయ్యారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ప్రత్యేక పోలీస్ బృందం నిందితున్ని పట్టుకుంది. అమితాబ్ బచ్చన్ వియ్యంకుని సోదరుడైన అనిల్ నందా పారిశ్రామిక వేత్త. ఇదిలా ఉండగా అవినాష్ చంద్ర ఝా, మాజిద్ అలీ, రాధాకృష్ణతోపాటు మరికొందరు అనిల్ నందాకు చెందిన ఫ్రెండ్స్ కాలనీలో న్న కోట్ల రూపాయల ఇంటిని కబ్జా చేసేందుకు యత్నించారు. దాంతోపాటు లుధియానాలోని భూములు, మరికొన్ని ఆస్తులను ఫోర్జరీ పత్రాలతో అమ్మాలని చూశారు. ఈ మేరకు కేసులు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు అవినాష్ చంద్ర ఝా, మాజిద్ అలీ, రాధాకృష్ణలను అరెస్ట్ చేశారు. దాదాపు రూ.250 కోట్ల మోసానికి యత్నించినట్లు సమాచారం. విచారణలో హైదరాబాద్‌లోని సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ పాత్ర కూడా ఉన్నట్టు వెళ్లడయ్యింది. ఈ క్రమంలోనే ప్రత్యేక పోలీస్ బృందం శ్రీధర్‌ను అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించింది.

Also Read..

హైదరాబాద్ MP అసదుద్దీన్ ఇంటిపై రాళ్ళ దాడి


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed