మరోసారి ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థుల ఆందోళన

by Disha Web Desk 19 |
మరోసారి ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థుల ఆందోళన
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులు మరోసారి ఆందోళనకు దిగారు. డిజిటల్ మీటర్ ద్వారా తమ హైట్‭‌ను తక్కువ చేసి చూపించి డిస్ క్వాలిఫై చేస్తున్నారని ఆదివారం హైదరాబాద్ అంబర్‌పేట్ పోలీస్ గ్రౌండ్స్‭లో అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు రీ మెజర్మెంట్స్ కోసం అంబర్‌పేట్ పొలీస్ గ్రౌండ్స్‭‌లో హైట్ చెకింగ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. అయితే, గతంలో వచ్చిన హైట్ కంటే రీ మెజర్మెంట్‌లో తక్కువ వచ్చిందంటూ అభ్యర్థులు ఆందోళన చేపట్టారు.

మాన్యువల్‌‭గా హైట్ చెక్ చేయాలని హైకోర్టు ఆదేశాలు ఉన్నా పట్టించుకోకుండా డిజిటల్ మీటర్‌తో చెక్ చేసి డిస్ క్వాలిఫై చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నో ఆశలు పెట్టుకుని వచ్చిన తమను బోర్డు, ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో చెకింగ్ చేసినప్పుడు వచ్చిన హైట్.. ఇప్పుడు ఎలా తగ్గుతుందని ప్రశ్నించారు. తమను మెయిన్స్‌కు క్వాలిఫై చేయాలని డిమాండ్ చేశారు.


Next Story