మరోసారి BJP MP బాండ్ పేపర్ బయటపెట్టిన KTR

by Disha Web Desk 2 |
మరోసారి BJP MP బాండ్ పేపర్ బయటపెట్టిన KTR
X

దిశ, తెలంగాణ బ్యూరో: మోడీ ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రైతులకు ద్రోహం చేస్తున్న మోడీ ప్రభుత్వానికి పసుపు రైతులు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో బాండ్ పేపర్‌పై పసుపు బోర్డు తీసుకొస్తానని ఎంపీ అరవింద్ హామీ ఇచ్చి, అనేక నిరసనలు చేసినప్పటికీ బోర్డు ఏర్పాటుకు నిరాకరించడం పసుపు రైతులను అవమానించడమే అని అన్నారు. ఈ బాండ్ పేపర్ హామీని మీరు గుర్తించారా? అని మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పటికైనా పసుపు బోర్డు ప్రకటించి పసుపు రైతులకు ఇచ్చిన వాగ్ధానాన్ని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాబోయే ఎన్నికల్లో పసుపు రైతులు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు


Next Story