బిగ్ బ్రేకింగ్: రెండవ రోజు ముగిసిన కవిత ఈడీ విచారణ.. తీవ్ర ఉత్కంఠకు తెర!

by Disha Web Desk 19 |
బిగ్ బ్రేకింగ్: రెండవ రోజు ముగిసిన కవిత ఈడీ విచారణ.. తీవ్ర ఉత్కంఠకు తెర!
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రెండవ రోజు ఈడీ విచారణ ముగిసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితను ఈడీ అధికారుల బృందం వరుసగా ఇవాళ రెండవ రోజు ప్రశ్నించింది. ఇవాళ్టికి కవిత విచారణ ముగిసినట్లు ఈడీ వర్గాలు ప్రకటించాయి. లాంఛనాల తర్వాత కవిత ఈడీ కార్యాలయం నుండి బయటకు రానున్నారు. కాగా, ఇవాళ ఉదయం 11.30 గంటలకు మొదలైన విచారణ.. రాత్రి 8.30 గంటలకు ముగిసింది. దాదాపు ఎనిమిదిన్నర గంటల పాటు కవితపై ఈడీ విచారణ బృందం ఇవాళ ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. సౌత్ గ్రూప్, పిళ్లై, బుచ్చిబాబులతో గల సంబంధాలపైనే ఎక్కువగా ప్రశ్నలు సంధించినట్లు సమాచారం.


Next Story

Most Viewed