- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
NVS Reddy: ప్రభుత్వ సలహాదారుడిగా ఎన్వీఎస్ రెడ్డి నియామకం
మెట్రో ఎండీగా సుదీర్ఘకాలం పనిచేసిన ఎన్వీఎస్ రెడ్డిని ప్రభుత్వ సలహాదారుడిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియమించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: మెట్రో ఎండీగా సుదీర్ఘకాలం పనిచేసిన (NVS Reddy) ఎన్వీఎస్ రెడ్డిని ప్రభుత్వ సలహాదారుడిగా (Government advisor) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియమించారు. ఆయన స్థానంలో హెచ్ఎండీఏ కమిషనర్గా పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి సర్ఫరాజ్ అహ్మద్ కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఎన్వీఎస్ రెడ్డి అర్బన్ ట్రాన్స్ పోర్ట్ సలహాదారుడిగా రెండు సంవత్సరాల పాటు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆదేశాలు జారీ చేశారు. ఎన్వీఎస్ రెడ్డి మెట్రో ఎండీగా సుదీర్ఘకాలంగా పనిచేస్తున్నారు. ఆయన ఎండీగా పదవీ కాలం ఈనెలాఖరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆయనను అక్కడి నుంచి రిలీవ్ చేసి ప్రభుత్వ సలహాదారుడిగా నియమించారు. ఆయనకున్న అనుభవాన్ని పట్టణ రవాణా రంగంలో వినియోగించుకోవడానికి గాను అర్బన్ ట్రాన్స్ పోర్ట్ సలహాదారుడిగా నియమించారు.
వీరితో పాటుగా పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేశారు. స్టడీ లీవ్లో వెళ్లి వచ్చిన శృతి ఓజా ను మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్గా నియమించారు. పంచాయతీరాజ్ కమిషనర్ శ్రీజన ఇప్పటి వరకు అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ గా పనిచేస్తున్న కృష్ణా ఆదిత్యకు సాంఘిక సంక్షేమ శాఖ గురుకులాల సొసైటీ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. హెచ్ఎండీఏ కార్యదర్శిగా కోటా శ్రీవాస్తకు అదనపు బాధ్యతలు అప్పగించారు.
నాన్ కేడర్ అధికారులకు..
ఆయిల్ ఫెడ్ ఎండీగా జి.జితేందర్ రెడ్డి నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం ఆదిలాబాద్ జడ్పీ సీఈవోగా పనిచేస్తున్నారు. ఆయిల్ ఫెడ్ ఎండీగా ఇప్పటి వరకు శంకరయ్య పనిచేశారు. ఆయన స్థానంలో జితేందర్ రెడ్డిని నియమించారు. నాన్ కేడర్ లో పనిచేస్తున్న పలువురు అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ చీఫ్ రేషనింగ్ ఆఫీసర్గా ఎం.రాజిరెడ్డిని నియమించారు. ఆయన ప్రస్తుతం పౌరసరఫరాల సంస్థలో జీఎంగా పనిచేస్తున్నారు. కరీంనగర్ గృహనిర్మాణ శాఖలో పీడీ పనిచేస్తున్న రాజేశ్వర్ ను ఆదిలాబాద్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్గా నియమించారు. పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న స్పెషల్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్ వెంకన్నను జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్గా నియమించారు. ఈ మేరకు సీఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.






