ఎన్‌ఆర్‌ఐలు తెలంగాణలో పెట్టుబడులకు ముందుకు రావాలి : మంత్రి కొప్పుల

by Disha Web Desk 4 |
ఎన్‌ఆర్‌ఐలు తెలంగాణలో పెట్టుబడులకు ముందుకు రావాలి : మంత్రి కొప్పుల
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని అమెరికాలోని పలు సంస్థలను, ప్రవాస భారతీయులను మంత్రి కొప్పుల కోరారు. అమెరికాలోని పనెన్స్ సిటీలో బీఆర్ఎస్ నాయకుడు ఆనంద్ రాజ్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రవాస వాసులు, పారిశ్రామిక వేత్తలతో బుధవారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పారిశ్రామికవేత్తలు తెలంగాణ పెట్టుబడులకు అనుకూలమని, పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ప్రభుత్వానికి తోడుగా ప్రైవేట్ రంగంలోను యువతకు అమెరికాలోని సంస్థలు సహకరిస్తే మేలు చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం సాల్ట్ లేక్ సిటీలో ఫ్యామిలీ సెర్చ్ ఇంటర్నేషనల్ సభ్యులతో కూడా భేటీ అయ్యారు.


Next Story