- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎంఈ, ఎంటెక్, ఎంఆర్క్ ప్రవేశాల గడువు పెంపు
రాష్ట్రంలోని ఎంఈ, ఎంటెక్, ఎంఆర్క్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్, సర్టిఫికేట్ల వెరిఫికేషన్ గడువును ఈ నెల 16వ తేదీ వరకు పొడిగించినట్లు టీజీ సెట్స్ అడ్మిషన్ల కన్వీనర్ ప్రొఫెసర్ ఐ. పాండురంగారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ఎంఈ, ఎంటెక్, ఎంఆర్క్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్, సర్టిఫికేట్ల వెరిఫికేషన్ గడువును ఈ నెల 16వ తేదీ వరకు పొడిగించినట్లు టీజీ సెట్స్ అడ్మిషన్ల కన్వీనర్ ప్రొఫెసర్ ఐ. పాండురంగారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 16 లోగా తమ సర్టిఫికేట్లను ఆన్లైన్లో అప్లోడ్ చేసి, రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. అభ్యర్థుల జాబితా ప్రదర్శన ఏవైనా సవరణలు ఉంటే ఈమెయిల్ ద్వారా తెలిపేందుకు ఈ నెల 18న అవకాశం కల్పించారు. ఈ నెల 19 నుండి 21 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు, 22న వెబ్ ఆప్షన్ల సవరణ ఉంటుందన్నారు. మొదటివిడత సీట్ల కేటాయింపు ఈ నెల 26న ఉంటుంది. సంబంధిత కాలేజీల్లో ఒరిజినల్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్, రిపోర్టింగ్ కు ఈ నెల 27 నుండి 30 వరకు అవకాశం కల్పించారు. పూర్తి వివరాలకు కోసం [email protected] ఈమెయిల్ ద్వారా సంప్రదించవచ్చని కన్వీనర్ తెలిపారు.






