రేపు రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. మూడు స్థానల భర్తీకి ఎన్నికలు

by Disha Web Desk 1 |
రేపు రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. మూడు స్థానల భర్తీకి ఎన్నికలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాజ్యసభ సభ‌కు తెలంగాణ రాష్ట్ర కోటాలో ఎంపికైన (బడుగుల లింగయ్యయాదవ్, సంతోష్ కుమార్, వద్దిరాజు రవిచంద్ర) ఏప్రిల్ 2తో పదవీ కాలం పూర్తి అవుతుంది. దీంతో ఈ మూడు స్థానాల భర్తీ కోసం కేంద్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. నేటి నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. ఈ 15న తుది గడువు కాగా, 16న నామినేషన్ల పరిశీలన, 20న ఉప సంహరణ కార్యక్రమం ఉంటుంది. ఈ నెల 27న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. అదే రోజూ సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు కార్యక్రమం చేపట్టి ఫలితాలను వెంటనే వెల్లడించనున్నారు. అయితే, కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షం 65 మంది ఎమ్మెల్యేలు కాగా, రెండు ఎంపీ స్థానాలు, బీఆర్ఎస్‌కు 39 మంది ఎమ్మెల్యేలు ఉండగా ఒక స్థానం దక్కనుంది.


Next Story

Most Viewed