- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దాదాపు పది రోజుల కింద గవర్నర్ వద్దకు ‘బీసీ’ ఆర్డినెన్స్.. నేటికీ అక్కడి నుంచి రాని పిలుపు!
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేసేందుకు ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేసేందుకు ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నది. అందుకోసం ఇప్పటికే పంచాయతీరాజ్చట్టం 2018కి సవరణ చేస్తూ రూపొందించిన ఆర్డినెన్స్ను ఆమోదం కోసం గవర్నర్ వద్దకు పంపింది. దాదాపు పదిరోజులు గడుస్తున్నా.. దానిపై రాజ్ భవన్ నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ ఆర్డినెన్స్కీలకం కావడంతో దానికి ఆమోదం లభిస్తే.. మిగిలిన ప్రక్రియ సులువు అవుతుందని పంచాయతీరాజ్శాఖ అధికారులు భావిస్తున్నారు. గవర్నర్ను కలిసి ఈ ఆర్డినెన్స్తీసుకువచ్చిన సందర్భంగా ప్రతిపాదించిన సవరణలను మరింత క్షుణ్ణంగా వివరించాలని చూస్తున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే రాజ్ భవన్కు చేరవేశారు. సందేహాలను ముందే నివృత్తి చేయడం ద్వారా ఆర్డినెన్స్ తిరస్కరణకు గురికాకుండా ఉంటుందని, ఆమోదం విషయంలో ఆలస్యం కాదని అంచనా వేశారు. కానీ, ఇంత వరకు రాజ్భవన్నుంచి పంచాయతీరాజ్అధికారులకు ఎలాంటి పిలుపురాలేదు. పిలుపు ఎప్పుడు వస్తుందోనని ఎదురుచూస్తున్నారు.
న్యాయ నిపుణుల సలహాలు!
రిజర్వేషన్లు 50శాతానికి మించి పెంచుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం, ఇప్పుడున్న 50 శాతం పరిమితిని ఎత్తివేయడం.. ఈ రెండు అంశాలే ప్రధాన లక్ష్యంగా పంచాయతీరాజ్చట్టానికి తెలంగాణ సర్కారు సవరణలు ప్రతిపాదిస్తూ ఆర్డినెన్స్ను తీసుకొచ్చింది. ఈ రెండింటి ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సలువు అవుతుంది. న్యాయపరంగా సైతం చిక్కులు రావని ప్రభుత్వం భావిస్తున్నది. ఇందుకు అనుగుణంగా న్యాయ నిపుణుల అభిప్రాయాలను తీసుకొని ఆర్డినెన్స్ను రూపొందించినట్టు సమాచారం.






