జూబ్లీహిల్స్ బైపోల్ పై ఎలాంటి స్టాండ్ తీసుకోలేదు : కవిత

by Muthe.Rajitha |   (  Updated:2025-10-26 11:30:33  IST  )

తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.

జూబ్లీహిల్స్ బైపోల్ పై ఎలాంటి స్టాండ్ తీసుకోలేదు : కవిత
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా కవిత ‘జాగృతి జనం బాట’ నిజామాబాద్‌లోవిజయవంతంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికపై ఇంకా ఎలాంటి స్టాండ్‌ తీసుకోలేదన్నారు. అందరి తెలంగాణ కావాలని.. కొందరి తెలంగాణ మాత్రమే కావొద్దు అనేది తన లక్ష్యం అని పేర్కొన్నారు.

బీఆర్‌ఎస్‌ 10 మంది ఎమ్మెల్యేలు ఎందుకు పార్టీ మారారో తనకు తెలియదన్నారు. పార్టీ ఏకపక్ష నిర్ణయం తీసుకొని తనను బయటకు పంపిందాన్ని ఆవేదన వ్యక్తం చేసారు. ఎమ్మెల్సీ పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి తాను రాజీనామా చేశానని, ఆ రాజీనామాకు కట్టుబడి ఉన్నానని కవిత స్పష్టం చేసారు.

READ MORE ....

నా వెనకాల మొరిగేటోళ్లను పట్టించుకోను.. కవిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Next Story