గడ్డి మందు తాగి యువకుడు మృతి..

by Kodari Anjali |

తిరుమలపూర్ గ్రామానికి చెందిన యువకుడు గడ్డి మందు సేవించి మృతి చెందాడు.

గడ్డి మందు తాగి యువకుడు మృతి..
X

దిశ, బాన్సువాడ: బాన్సువాడ మండలం, తిరుమలపూర్ గ్రామానికి చెందిన యువకుడు గడ్డి మందు సేవించి మృతి చెందాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. తిరుమలపూర్‌కు చెందిన జక్కాపురం సందీప్ (19) బర్ల కాపరిగా జీవనం సాగించేవాడు. జూన్ 12 మధ్యాహ్నం గుర్తుతెలియని కారణాల వల్ల పారాక్వాట్ డైక్లోరైడ్ అనే గడ్డి మందును సేవించాడు. అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే చికిత్స పొందుతూ.. సందీప్ మృతి చెందాడు. మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువకుడు గడ్డి మందు సేవించడానికి గల కారణాలపై విచారణ కొనసాగుతోందని బాన్సువాడ పోలీసులు తెలిపారు.

Next Story