వ్య‌వ‌సాయానికి నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2026-06-11 11:19:48  IST  )

వ్యవసాయానికి నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలని గురువారం బషీరాబాద్ గ్రామ పంచాయితీ, గ్రామ కమిటీ ఆధ్వర్యంలో విద్యుత్ సబ్ స్టేషన్ లో విద్యుత్ శాఖ ఏఈ కృష్ణకాంత్ కు వినతి పత్రం అందజేశారు.

వ్య‌వ‌సాయానికి నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి
X

దిశ, కమ్మర్‌ పల్లి : వ్యవసాయానికి నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలని గురువారం బషీరాబాద్ గ్రామ పంచాయితీ, గ్రామ కమిటీ ఆధ్వర్యంలో విద్యుత్ సబ్ స్టేషన్ లో విద్యుత్ శాఖ ఏఈ కృష్ణకాంత్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా లేక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు పసుపు, మక్కలు విత్తనాలు, ఇతర పంటలు సాగుచేస్తున్నారు. రైతులకు విద్యుత్ సరపరలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. గతంలో లాగ 18-20 గంటల విద్యుత్ సరఫరా చేయాలనీ కోరారు. స్పందించిన ఏఈ రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ విద్యుత్ సరఫరా సమయాన్ని పెంచేందుకు పై అధికారులతో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Next Story