మధ్యాహ్న భోజనం బాగుంటున్నదా : ఎంపీపీ దొడ్ల నీరజ

by Disha Web Desk 20 |
మధ్యాహ్న భోజనం బాగుంటున్నదా : ఎంపీపీ దొడ్ల నీరజ
X

దిశ, బాన్సువాడ : పాఠశాలలో అందిస్తున్న మధ్యాహ్న భోజనం బాగుంటున్నదా అని బాన్సువాడ ఎంపీపీ దొడ్ల నీరజ వెంకట్రాంరెడ్డి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. బాన్సువాడ మండల పరిధిలోని అవాజపల్లి తాండా గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం, ప్రాథమిక పాఠశాలలను ఆమె మంగళవారం స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అదేవిధంగా హన్మాజిపేట్ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను కూడా పరిశీలించారు.

ఈ సందర్భంగా అక్కడ ఉన్న చిన్నారులు, బాలింతలు, విద్యార్థిని విద్యార్థులతో ఎంపీపీ ముచ్చటించారు. మధ్యాహ్న భోజనం రుచికరంగా ఉంటున్నయా, సమయానికి భోజనం అందిస్తున్నారా, గుడ్లు, పాలు చిన్నారులకు, బాలింతలకు అందిస్తున్నారా అని వివరాలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా పాఠశాల తరగతి గదులు, వంట గది, పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని అంగన్వాడీ కేంద్రం సిబ్బందికి, పాఠశాల సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో హన్మాజిపేట్ గ్రామ సర్పంచ్ సుభాష్, ఎంపీటీసీ సుధాకర్ రెడ్డి, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed