Kamareddy : భార్య మరణాన్ని తట్టులేక ఆసిడ్ తాగిన భర్త

by Muthe.Rajitha |

భార్య మరణాన్ని తట్టులేక ఆసిడ్ తాగి సూసైడ్ భర్త(Husband Suicide) చేసుకున్న ఘటన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా(Nizamabad District)లో చోటు చేసుకుంది.

Kamareddy : భార్య మరణాన్ని తట్టులేక ఆసిడ్ తాగిన భర్త
X

దిశ, వెబ్ డెస్క్ : భార్య మరణాన్ని తట్టులేక ఆసిడ్ తాగి సూసైడ్ భర్త(Husband Suicide) చేసుకున్న ఘటన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా(Nizamabad District)లో చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో భార్య మరణాన్ని తట్టుకోలేని భర్త.. తాను కూడా ప్రాణాలు తీసుకున్న ఘటన బిచ్కుందలో జరిగింది. కామారెడ్డి జిల్లా బిచ్కుంద(Bichkunda)కు చెందిన సునీల్, జ్యోతిలకు గత ఏడాది వివాహం జరుగగా.. జ్యోతి ప్రస్తుతం 7 నెలల గర్భవతి. అయితే 10 రోజుల కింద సీమంతం పూర్తి చేసుకొని పుట్టింటి నుంచి భర్త బైక్ పై శనివారం అత్తవారింటికి వస్తుండగా.. అతి వేగం వలన బైక్ మీది నుంచి జారీ జ్యోతి కింద పడి తీవ్ర గాయాలు అయ్యాయి.

చికిత్స పొందుతూ మృతి చెందింది. కాగా భార్య మృతిని తట్టుకోలేని సునీల్.. ఆదివారం తెల్లవారుజామున యాసిడ్ తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఓ రోడ్డు ప్రమాదం ఇద్దరు నవ దంపతుల జీవితాన్ని బలి తీసుకోవడంతో రెండు కుటుంబాలు తీరని శోకంలో మునిగిపోయాయి.

Next Story