- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
తెలంగాణపై విషం చిమ్ముతున్న బీజేపీ
దిశ, ఇందల్వాయి: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంట్లో చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఇందల్వాయి మండల కేంద్రంలో ఎంపీపీ రమేష్ నాయక్, టీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు గంగాదాస్, శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రధాని దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. మోడీకి హటావో దేశానికి బచావో అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ రమేష్ నాయక్ మాట్లాడుతూ.. ఎందరో ఆత్మబలిదానాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని, రాష్ట్ర ప్రజల పట్ల బీజేపీ విషం చిమ్ముతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశానికి ప్రధాని హోదాలో ఉండి రాష్ట్రాల పట్ల అనుచితంగా మాట్లాడడం సిగ్గుచేటన్నారు. బడ్జెట్లో తెలంగాణకు నయాపైసా కేటాయించలేదని అన్నారు. తెలంగాణ అభివృద్ధిని జీర్ణించుకోలేకనే బీజేపీ నాయకులు సీఎం కేసీఆర్ పట్ల ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం బీజేపీ పార్టీకి మాట్లాడే హక్కు లేదన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఉపాధ్యక్షులు బిరీష్, సీనియర్ నాయకులు పాశం కుమార్, శ్రీనివాస్, చింతల దాస్, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.