షబ్బీర్ అలీ కాన్వాయ్‌కు తప్పిన పెను ప్రమాదం!

by velandi.Saikiran |

షబ్బీర్ అలీ కాన్వాయ్‌కు పెను ప్రమాదం తప్పింది. ఈ నెల 15న జరగనున్న బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించేందుకు కామారెడ్డి కి

షబ్బీర్ అలీ కాన్వాయ్‌కు తప్పిన పెను ప్రమాదం!
X

దిశ, కామారెడ్డి : షబ్బీర్ అలీ కాన్వాయ్‌కు పెను ప్రమాదం తప్పింది. ఈ నెల 15న జరగనున్న బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించేందుకు కామారెడ్డి కి వచ్చిన మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ లు వ‌చ్చారు. అయితే... హైదరాబాద్ తిరుగు ప్రయాణంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ వాహనానికి పెను ప్రమాదం త‌ప్పింది. డ్రైవర్ చాకచక్యంతో నలుగురి ప్రాణాలతో బ‌య‌ట‌ప‌డ్డారు. వేగంగా వెళ్తున్న కాన్వాయ్ లోకి అడ్డంగా కారు ఓ కారు వ‌చ్చింది. అయితే దానిని తప్పించబోయి డివైడర్ తగిలి షబ్బీర్ అలీ కారుకు పెను ప్ర‌మాదానికి గురైంది. షబ్బీర్ అలీ కారు బుల్లెట్ ప్రూఫ్ కావడంతో చిన్నగా డ్యామేజ్ అయింది. కాగా ఈ ప్రమాదంలో ఎవరు కూడా గాయపడలేదు.

Next Story