ఎస్సీ రిజర్వేషన్ ఇచ్చిన పార్టీకే మద్దతు

by Disha Web Desk 15 |
ఎస్సీ రిజర్వేషన్ ఇచ్చిన పార్టీకే మద్దతు
X

దిశ, నిజామాబాద్ సిటీ : ఎస్సీ రిజర్వేషన్ ఇచ్చిన పార్టీకే తమ పూర్తి మద్దతు ఉంటుందని నేషనల్ కో ఆర్డినేటర్ కె. మల్లేష్ కుమార్ అన్నారు. శనివారం ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మన రజక సంఘం కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మన రజక సంఘం టౌన్ అధ్యక్షుడిగా కనక రాజు, కార్యదర్శిగా శ్యామ్ సింగ్, కోశాధికారిగా ప్రభాకర్,ఉపాధ్యక్షులుగా సత్యనారాయణ, చిన్న సాయిలు, శివ కుమార్, రూపేష్, అశోక్, సహాయ సహాయ కార్యదర్శులుగా విజయ్, శంకర్, గంగరాజు, శంకర్ సింగ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికైన కార్యవర్గానికి నియామక పత్రాలను అందజేశారు. అనంతరం నేషనల్ కో ఆర్డినేటర్ కె. మల్లేష్ కుమార్ మాట్లాడుతూ..17 రాష్ట్రాలలో రజకులకు

ఎస్సీ రిజర్వేషన్ ఇచ్చారని, కేవలం 11 రాష్ట్ర లలో బీసీ లుగా చేర్చారని అన్నారు. బ్రిటిష్ ప్రభుత్వం ఉన్న దగ్గర మాత్రమే ఎస్సీ లుగా ఇచ్చారని, తెలంగాణ లో నైజాం పాలన ఉండడంతో చేర్చలేక పోయారన్నారు. మిగితా కులాలకు వ్యతిరేకం కాదని, వారి రిజర్వేషన్ 15 శాతం అట్లాగే ఉంచి మాకు అదనంగా రెండు శాతం కలిపి 17 శాతం రిజర్వేషన్ కల్పించాలన్నారు. అంటరాని బట్టలు ఉతుకుతున్నతమ కులస్తులకు ఎస్సీ రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ రిజర్వేషన్ ఇచ్చిన పార్టీకే తమ మద్దతు ఇస్తామన్నారు.

ఎలక్షన్ కోడ్ రాక ముందే కేంద్రానికి సిఫారస్ చేయాలని కోరారు. కార్యక్రమంలో ఉద్యోగ సంఘాల నాయకులు వర్సపల్లి నర్సింహులు, మన రజక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నాని, రాష్ట్ర కార్యదర్శి భూమేష్, యూట్యూబ్ ప్రధాన కార్యదర్శి, యూత్ ప్రధాన కార్యదర్శి సాయి, యూత్ ఉపాధ్యక్షులు రవీందర్, రాష్ట్ర కమిటీ సభ్యులు అంజయ్య, రాష్ట్ర సాంస్కృతిక కన్వీనర్ పోశెట్టి, రజక కులస్తులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed