నియోజకవర్గాన్ని నిలువుటద్దంగా మార్చినా..

by Disha Web Desk 20 |
నియోజకవర్గాన్ని నిలువుటద్దంగా మార్చినా..
X

దిశ, బాన్సువాడ : బాన్సువాడ నియోజకవర్గాన్ని తాను తనహయాంలో అభివృద్ధి చేసి నిలువుటద్దంగా మార్చానని రాష్ట్రశాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని మోస్రా‌, చందూర్, వర్ని, రుద్రూరు మండలాల పరిధిలో జరుగుతున్న అభివృద్ధిపనులపై ఆయా మండలాల ప్రజాప్రతినిధులు, అధికారులతో మంగళవారం సమీక్షసమావేశం నిర్వహించారు. మోస్రా మండల కేంద్రం, వర్ని మండల కేంద్రంలోని సీసీడీలలో జరిగిన ఈ సమీక్ష సమావేశాలలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి బాన్సువాడ నియోజకవర్గం మీద ప్రత్యేక ప్రేమతో భారీగా నిధులను మంజూరు చేశారన్నారు.

గ్రామాలలో ప్రజలకు కావలసిన పనులకు అడిగినవి కాదనకుండా నిధులను మంజూరు చేశానని ఆయన తెలిపారు. నూతన మండలాల కాంప్లెక్స్ భవనాలు, కమ్యునిటీ హాల్స్, పొలాల రోడ్లు, నూతన గ్రామపంచాయతీ భవనాలు, సీసీ రోడ్లకు కావలసిన నిధులు మంజూరు అయ్యాయని తెలిపారు. నిధులు మంజూరు అయ్యి టెండర్ పూర్తయిన పనులను వచ్చే జూన్ నాటికి పూర్తిచేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఆర్డివో రాజేశ్వర్, ఏసీపీ కిరణ్ కుమార్, రాష్ట్ర నాయకులు పోచారం సురేందర్ రెడ్డి, ఆయా మండలాల ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed