వాటర్ ప్యాకెట్లు కొనలేదని వ్యక్తిపై దాడి

by Dishafeatures2 |
వాటర్ ప్యాకెట్లు కొనలేదని వ్యక్తిపై దాడి
X

దిశ, ప్రతినిధి, నిజామాబాద్: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని లక్ష్మి థియేటర్ ఎదురుగా ఉన్న భద్రకాళి వైన్స్ వద్ద ఆదివారం రాత్రి మద్యం ప్రియులతో షాపు యజమానులు గొడవపడ్డారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. అడవి లింగాల గ్రామానికి చెందిన క్రిష్ణ అనే వ్యక్తి మద్యం తీసుకొని నాలుగు వాటర్ పాకెట్లు వేరే షాప్ లోకి వెళ్లి తీసుకొని పర్మిట్ రూమ్ వద్దకు మద్యం సేవించడానికి వెళ్ళాడు. అక్కడకు వెళ్లిన కృష్ణ పై తమ వద్ద ఎందుకు కొనలేదని వైన్స్ వద్ద ఉన్న దుకాణదారులు గొడవపడ్డారు. వైన్స్ నిర్వాహకులు ముగ్గురు కలిసి అతనిపై దాడి చేసి రక్తం వచ్చేటట్టు ముక్కు మీద దాడి చేసి కొట్టినట్లు బాధితుడు తెలిపారు. దాడి చేసిన వారిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశానని బాధితుడు తెలిపాడు.

ఇవి కూడా చదవండి : కప్పను చంపి సాంబార్ చేసిన వ్యక్తి.. అది తిని చిన్నారి మృతి





Next Story