కృష్ణాజివాడిలో రోడ్డు ప్ర‌మాదం.. వ్య‌క్తి మృతి

by Ratna Kumari |   (  Updated:2026-01-01 16:07:27  IST  )

దిశ‌, తాడ్వాయి : మండ‌ల ప‌రిధిలోని కృష్ణాజివాడి స‌మీపంలో గురువారం రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది.

కృష్ణాజివాడిలో రోడ్డు ప్ర‌మాదం.. వ్య‌క్తి మృతి
X

దిశ‌, తాడ్వాయి : మండ‌ల ప‌రిధిలోని కృష్ణాజివాడి స‌మీపంలో గురువారం రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఈ రోడ్డు ప్ర‌మాదంలో ఓ వ్య‌క్తి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. దేవాయిప‌ల్లి గ్రామానికి చెందిన రాజ‌య్య అనే వ్య‌క్తి త‌న ద్విచ‌క్ర వాహ‌నం పై వెళ్తుండ‌గా.. బ‌స్సు టైర్ కింద ప‌డింది. దీంతో రాజ‌య్య అక్క‌డిక‌క్క‌డే మృతి చెందాడు. ఈ ప్ర‌మాదం గురించి స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించ‌డంతో పోలీసులు ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకున్నారు. పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Next Story