గులాబీమయమైన గాంధారి.. లేటుగా ప్రారంభం కానున్న కార్యక్రమాలు!

by Disha Web Desk 7 |
గులాబీమయమైన గాంధారి.. లేటుగా ప్రారంభం కానున్న కార్యక్రమాలు!
X

దిశ, గాంధారి: గాంధారి మండల కేంద్రంలో నిర్వహించాల్సిన సీసీ రోడ్ శంకుస్థాపన 11 గంటలకు, గాంధారి నుండి ఉప్పల్వాయి వరకు డబుల్ రోడ్డు పనుల నిర్మాణ శిలాఫలకం ఆవిష్కరణ 11:30 కు, ఆత్మీయ సమ్మేళనం 12 గంటలకు జరగాల్సి ఉంది. అయితే వేముల ప్రశాంత్ రెడ్డి రావడం కొద్దిగా లేట్ కావడంతో అన్ని కార్యక్రమాలు లేట్‌గానే ప్రారంభమవుతాయని తెలుస్తోంది.

కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో ఆదివారం తెలంగాణ రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్‌తో పాటు ఎమ్మెల్యే జాజాల సురేందర్ సీసీ రోడ్ ఉదయం 11:00 కు శంకుస్థాపన కార్యక్రమం.. గాంధారి నుండి ఉప్పల్వాయి వరకు డబుల్ రోడ్డు పరిశీలన శిలాఫలక ఆవిష్కరణ కార్యక్రమం.. తర్వాత ఆత్మీయ సమ్మేళనం 12 గంటలకు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు గాంధారి మండల కేంద్రంలో రోడ్డుపై ఫ్లెక్సీలు, జెండాలతో కిక్కిరిసిపోతున్నాయి. మొత్తం మీద బీఆర్ఎస్ నాయకులు మొత్తం గులాబీమయంగా మార్చారు.

Next Story

Most Viewed