రెన్నె ళ్ల నుంచి వ్యక్తి అదృశ్యం..

by Kodari Anjali |

రెన్నె ళ్ల నుంచి అదృశ్యమైన సంఘటన ఉప్పల్ వాయి గ్రామంలో చోటు చేసుకుంది.

రెన్నె ళ్ల నుంచి వ్యక్తి అదృశ్యం..
X

దిశ, సదాశివ నగర్ (రామారెడ్డి): మండలం ఉప్పల్ వాయి గ్రామానికి చెందిన ఒక వ్యక్తి రెన్నె ళ్ల నుంచి అదృశ్యమైన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. రామారెడ్డి ఎస్ఐ రాజశేఖర్ కథనం ప్రకారం.. మండలంలోని ఉప్పల్ వాయి గ్రామానికి చెందిన జంగిటి నారాయణ రెన్నెళ్ల క్రితం ఎవరికి చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు తెలిపారు. కుటుంబీకులు, బంధువుల ఇళ్లలో స్నేహితుల ఇళ్లలో, చుట్టుపక్కల వెతికినప్పటికీ ఎక్కడ జాడ తెలియలేదని తెలిపారు. దీంతో ఈ మేరకు అతని భార్య జంగిటి లక్ష్మి రామారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Next Story