పెండింగ్‌ కేసులను పూర్తి చేయాలి

by Naveena |   (  Updated:2025-03-12 06:19:50  IST  )

నూతనంగా జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన రాజేష్ చంద్ర బుధవారం గాంధారి పోలిస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

పెండింగ్‌ కేసులను పూర్తి చేయాలి
X

దిశ , గాంధారి : నూతనంగా జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన రాజేష్ చంద్ర బుధవారం గాంధారి పోలిస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం స్టేషన్ రికార్డు లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పెండింగ్ కేసులు త్వరితగతిన పూర్తి చేయాలని ,రాణాకు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు, సదాశివనగర్ సీఐ సంతోష్ కుమార్ , స్థానిక ఎస్ఐ ఆంజనేయులు , సిబ్బంది పాల్గొన్నారు.

Next Story