కలెక్టర్ జన్మదినాన్ని పురస్కరించుకుని మొక్కలు నాటిన పంచాయతి సెక్రటరీ..

by Disha Web Desk 20 |
కలెక్టర్ జన్మదినాన్ని పురస్కరించుకుని మొక్కలు నాటిన పంచాయతి సెక్రటరీ..
X

దిశ, తాడ్వాయి : కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ జన్మదినాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో గురువారం తాడ్వాయి పంచాయతీ సెక్రటరీ బాలు మొక్కలను నాటారు. అనంతరం కలెక్టర్ జితేష్ వి పాటిల్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాలతో ముందుకు సాగుతోందని, రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కారోబార్ గంగాధర్, యఫ్ ఏ అనిల్, గ్రామ పంచాయతీ సిబ్బంది, డ్వాక్రా గ్రూప్ మహిళలు, తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed