బాన్సువాడలోని గణేష్ మండపాల ఏర్పాట్లపై అధికారుల ఫోకస్

by velandi.Saikiran |

వినాయక ఉత్సవాలలో భాగంగా అందుకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించేందుకు జిల్లా ఎస్.పి. రాజేష్ చంద్ర బాన్సువాడలో పర్యటించ

బాన్సువాడలోని గణేష్ మండపాల ఏర్పాట్లపై అధికారుల ఫోకస్
X

దిశ, బాన్సువాడ: వినాయక ఉత్సవాలలో భాగంగా అందుకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించేందుకు జిల్లా ఎస్.పి. రాజేష్ చంద్ర బాన్సువాడలో పర్యటించారు. ముందుగా వినాయకుల నిమజ్జనం సంబంధించిన రూట్ మ్యాప్ ను పరిశీలించి, పట్టణంలోని కల్కి చెరువు వద్ద నిమజ్జనం ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం మీడియాతో వారు మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు జరగాలన్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్, ఫైర్ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, డి.ఎస్.పి. విట్టల్ రెడ్డి, సి.ఐ. అశోక్, మున్సిపల్ కమీషనర్ శ్రీహరి రాజు మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Next Story