- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
నలంద పాఠశాలకు నోటీస్ జారీ..
by Disha Web Desk 20 |
X
దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో గల నలంద పాఠశాలకు శనివారం నోటీసులు జారీ చేసినట్టు ఎంసీఓ పింజ రాజ గంగారం తెలిపారు. పాఠశాలలో పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని పలువిద్యార్థి సంఘాలు ఫిర్యాదు ఇచ్చారని ఆయన తెలిపారు. ఈ మేరకు మామిడిపల్లి ఉన్నత పాఠశాల హెచ్ఎం, సీఆర్పీని పంపించి నలంద పాఠశాలలో పాఠ్యపుస్తకాలు ఉన్న గదిని సీజ్ చేసి ఆ పాఠశాలకు నోటీస్ జారీ చేసినట్లు ఆయన తెలిపారు. అలాగే ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలో పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నందుకు వివరణ కోరుతూ షోకాజు నోటీస్ జారీ చేసినట్లు చెప్పారు. ఏ ప్రైవేట్ పాఠశాలలైన పాఠ్యపుస్తకాల అమ్మకాలు జరిపినట్లయితే ఆ పాఠశాలలపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఎంఈఓ హెచ్చరించారు.
Next Story