నిజామాబాద్ ప్రభుత్వాసుత్రిలో వైద్యుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణాలు బలి

by Disha Web Desk 1 |
నిజామాబాద్ ప్రభుత్వాసుత్రిలో వైద్యుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణాలు బలి
X

దిశ, నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ జిల్లా ప్రభుత్వాసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. చికిత్స కోసం వచ్చిన రోగులకు నిరాశే ఎదురువుతోంది. బోధన్ మండలానికి చెందిన పెద్ద మావండి గ్రామానికి చెందిన మాధవరావు అనే వ్యక్తికి తలనొప్పి, నీరసంగా ఉందని శనివారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. అయితే, ఆదివారం ఉదయం ఏడు గంటల వరకు ఆరోగ్యంగానే ఉన్న మాధవరావు ఒక్కసారిగా స్పృహ కోల్పోయి మృతి చెందాడు. దీంతో మృతుడి కుమారుడు వైద్యులు సరైన చికిత్స అందించలేదని ఆరోపించాడు.

అయితే, జిల్లా ప్రభుత్వాసుపత్రిలో కేవలం రెండు రోజుల వ్యవధిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయినా ఆసుపత్రి సూపరింటెండెంట్ కనీసం వివరణ ఇవ్వకపోవడం గమనార్హం. ఇంచార్జ్ డాక్టర్లు వైద్యులు, నర్సులు కేవలం టైంపాస్‌కు మాత్రమే ఆసుపత్రికి వస్తున్నారని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రిలో రోగి చనిపోయాడని తెలిసిన కొందరు జర్నలిస్టులు ఎమర్జెన్సీ వార్డుకు చేరుకుని ఫోటోలు తీస్తుండగా అక్కడున్న సిబ్బంది, పోలీసులు వారిని అడ్డుకునేందుకు యత్నించారు.


Next Story

Most Viewed