మూడు ప్రాణాలను కాపాడిన పోలీసులు..

by Disha Web Desk 20 |
మూడు ప్రాణాలను కాపాడిన పోలీసులు..
X

దిశ, నిజామాబాద్ క్రైం : ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో అశోక్ సాగర్ లో దూకి అత్మహత్యాయత్నానికి పాల్పడగా పోలీసులు వారిని ఒడ్డుకు చేర్చి కాపాడారు. ఈ సంఘటన ఆదివారం సాయంత్రం జరిగింది. ఆరవ టౌన్ ఎస్సై సాయి కుమార్ కథనం ప్రకారం బోదన్ పట్టణానికి చెందిన హబిబున్నిసా అనే మహిళ తన ఇద్దరు పిల్లలతో ఆశోక్ సాగర్ కు వచ్చింది.

కుటుంబ కలహాల నేపథ్యంలో ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించింది. ఈ విషయం తెలిసిన ఆరవ టౌన్ పోలిస్ లు అక్కడికి చెరుకుని ముగ్గురిని కాపాడారు. కౌన్సిలింగ్ ఇచ్చి ఆమె సోదరుడికి వారిని అప్పగించారు.

Next Story