కేసీఆర్ ఆశీస్సులు అందుకున్న ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి

by Ratna Kumari |

మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి శనివారం తన జన్మదినం సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్ ఆశీస్సులు అందుకున్నారు.

కేసీఆర్ ఆశీస్సులు అందుకున్న  ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి
X

దిశ, వేల్పూర్ : మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి శనివారం తన జన్మదినం సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్ ఆశీస్సులు అందుకున్నారు. ప్రశాంత్ రెడ్డి శనివారం ప్రత్యేకంగా ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రం వ‌ద్ద‌కు వెళ్లి కేసీఆర్ ను కలిశారు. తనకు తండ్రి లాంటి తమ అధినేత కేసీఆర్ ఆశీస్సులు అందుకోవాలనే ఆలోచనతో ఆయన ఆశీస్సులు అందుకున్నట్టు ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఈ సందర్బంగా కేసీఆర్ తనకు ప్రేమ పూర్యకంగా దగ్గరకు తీసుకుని ఆశీర్వదించారని, ప్రజలకు మరింత ఉత్సాహంగా పని చేయాలని ఆకాంక్షించినట్లు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి తెలిపారు.

Next Story