- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, కామారెడ్డి: నిజామాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి మండలం క్యాసంపల్లి గ్రామానికి చెందిన సంగి సాయిలు తన కూతురును వేములవాడలో దింపడానికి బైకుపై వెళ్ళాడు. కూతురిని వేములవాడలో వదిలి తిరిగి బైకుపై బయలుదేరిన సాయిలు మాచారెడ్డి మండలం పెద్దమ్మ శివారులో కిలోమీటర్ రాయిని ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సాయంతో సమాచారం అందుకున్న మాచారెడ్డి ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.
Next Story






