ఎంఎస్పీ గ్యారెంటీ చట్టం కోసం ప్రధాన మంత్రికి లేఖ

by Disha Web Desk 20 |
ఎంఎస్పీ గ్యారెంటీ చట్టం కోసం ప్రధాన మంత్రికి లేఖ
X

దిశ ఆర్మూర్ : ఎంఎస్పీ గ్యారెంటీ చట్టం కోసం డిమాండ్ చేస్తూ తెలంగాణ పసుపు రైతుల సంఘం, దక్షిణ భారత రైతు సమాఖ్య తరపున ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కోటపాటి నరసింహం నాయుడు శుక్రవారం లేఖ రాశారు. రైతు సాగు చట్టాలను ఉపసంహరించుకునే సందర్భంలో ఎంఎస్పీ గ్యారెంటీ చట్టం తెస్తామని ఇచ్చిన హామీని కేంద్రం నిలబెట్టుకో వాల్సిందిగా కోరారు. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ను ఎంఎస్పీ గ్యారెంటీ చట్టం కోసం డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పటికైనా రైతులు పండించిన పంటలను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసే విధంగా కేంద్రం చట్టం తీసుకురావాలని అన్నారు.



Next Story

Most Viewed