దిశ ఎఫెక్ట్.. దిశ చెప్పింది.. నాయకులు చేశారు..

by Disha Web Desk 20 |
దిశ ఎఫెక్ట్.. దిశ చెప్పింది.. నాయకులు చేశారు..
X

దిశ, రాజంపేట : మండలంలోని కొండాపూర్ గ్రామంలో శుక్రవారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు తెలంగాణ తల్లివిగ్రహానికి పూలమాలలు అలంకరించడం మర్చిపోయారు. జడ్పీటీసీ, ఎంపీపీ గ్రామంలోనె ఇలా జరగడం మండలంలోని చర్చనీయాంశంగా మారింది. ఈ వార్తని దిశలో తెలంగాణ తల్లిని నాయకులు, అధికారులు మరిచారు అని ప్రచురించింది. వెంటనే శనివారం రోజున జడ్పీటీసీ కొండా హన్మండ్లు, ఎంపీపీ లింగాల స్వరూప కృష్ణమూర్తి, స్థానిక సర్పంచ్ స్వాతి భాస్కర్, అధికారులు స్పందించి తెలంగాణ తల్లి విగ్రహానికి అలంకరణ చేసి పూలమాల వేశారు.

Next Story

Most Viewed