ఆస్తి తగాదాల్లో లాయర్ హత్య..? అనుమానాస్పద స్థితి అంటున్న పోలీసులు

by Web Desk |
ఆస్తి తగాదాల్లో లాయర్ హత్య..? అనుమానాస్పద స్థితి అంటున్న పోలీసులు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ నగర శివారులోని మాణిక్ భండార్‌లో అశోక్ రెడ్డి అనే న్యాయవాది అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఈ సంఘటన శనివారం జరిగింది. కానీ ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అశోక్ రెడ్డి కి తండ్రి ద్వారా సంక్రమించిన ఆస్తి వ్యవహరంలో గొడవలు ఉన్నట్లు తెలిసింది. శనివారం బాత్రూంలో నిర్జీవంగా ఉండడం చూసి అతని కుటుంబ సభ్యులు మాక్లూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో అశోక్ రెడ్డి సోదరుడు అతని కుమారులే హత్య చేసి ఇంట్లో పాడవేశారని పేర్కొన్నారు. సంఘటన స్థలాన్ని ఇంచార్జి సీఐ జగడం నరేష్ పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Next Story

Most Viewed