ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి వేముల

by Dishanational1 |
ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి వేముల
X

దిశ, భీమ్‌గల్: క్రిస్మస్ పండుగ పర్వదినం పురస్కరించుకుని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. యేసుక్రీస్తు జన్మించిన ఈ శుభ దినాన అందరికీ శాంతి, సౌభాగ్యాలు చేకూరాలని ఆకాంక్షించారు. ఈ క్రిస్మస్ వేడుక ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషం నింపాలని, ఇంటింటా ఆనందపు కాంతులు వెల్లివిరియాలని అభిలషించారు.

Next Story

Most Viewed