- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గిరిజనుల హక్కుల సాధన కోసం పోరాడిన వీరుడు కొమురంభీం : పెంకటి గణేష్
దిశ, బాన్సువాడ : గిరిజనుల హక్కుల సాధన కొరకు తన జీవితాంతం పోరాడిన గోండు వీరుడు కొమురం భీం అని నాయక్పోడ్ సంఘం జిల్లా

దిశ, బాన్సువాడ : గిరిజనుల హక్కుల సాధన కొరకు తన జీవితాంతం పోరాడిన గోండు వీరుడు కొమురం భీం అని నాయక్పోడ్ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పెంకటి గణేష్ అన్నారు. బాన్సువాడ మండలం హన్మాజీపేట్ గ్రామంలో మంగళవారం ఆదివాసీ నాయకులు, గిరిజన సంఘ సభ్యుల ఆధ్వర్యంలో కొమురంభీం 85 వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. కొమురం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గిరిజనుల హక్కుల కొరకు జీవితాంతం పోరాడిన వీరుడు కొమురంభీం అని నాయక్పోడ్ సంఘం కామారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు పెంకటి గణేష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పెంకటి గణేష్ మాట్లాడుతూ.. జల్, జంగల్, జమీన్ నినాదంతో ఆడబిడ్డల హక్కుల కోసం, గిరిజనుల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన గోండు వీరుడు కొమురం భీం అనిఅన్నారు. ఆయన దేశానికి గర్వకారణమని, గిరిజనుల ఆత్మగౌరవ ఉద్యమాలకు మార్గదర్శకుడని తెల్పారు. ఆ విప్లవ వీరునికి జోహార్లు అంటూ నినదించారు. కార్యక్రమంలో మాజీ ప్రధాన కార్యదర్శి కొంకి గణేష్, సంఘ అధ్యక్షుడు కొంకి సాయిలు,సభ్యులు గంగాధర్, పోచయ్య, శుభాష్, చిరంజీవి, రాజు,లింగం, ప్రవీణ్, సాయిరాం, శ్రీకాంత్ పాల్గొన్నారు.






